Skip to main content

Posts

Showing posts from 2017

సద్విమర్శని స్వీకరించడము కూడా ఒక గొప్ప విషయమే

బలవంతులదే రాజ్యం, అనాదిగా వస్తున్న రాజనీతి ఇది. పూర్వం గెలిచిన రాజు  రాజ్యమేలితే, ఇప్పుడు నోటోళ్ళు రాజ్య మేలుతున్నారు. ఎవరైనా మంచి చేద్దామని వస్తే నోటితో బెదరగొట్టి తరిమేస్తున్నారు. ఇదే స్ట్రాటజీ అన్ని స్థాయిల్లో ఉండటాన్ని గమనించాను. పీఎం, సీఎం, ఎంపీ, ఎంల్ఏ  స్థాయి నుండి గల్లీ లీడర్ వరకు ఇదే తంతు. మరి యధా రాజా తధా ప్రజా కదా? ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ చేసినప్పుడు, నిజమైన నాయకుడు ఆ విమర్శకి సమాధానం చెప్పి విమర్శని తిప్పి కొట్టవచ్చు, లేదంటే తప్పుని ఒప్పుకొని సరిజేసుకోవచ్చు. సద్విమర్శని స్వీకరించడము కూడా ఒక గొప్ప విషయమే. జైహింద్ శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం

సాహా చిన్నగంజాం పోలీస్

రొయ్యల చెరువులలో బాటమ్ పనులు చేయించి పంపింగ్కి రెడీ గా వున్న చెరువుల కట్టలని పగల గొట్టుకొని జేసీబీ ని మరియు ట్రాక్టర్లు ని దౌర్జన్యముగా మరియు ఇంఫార్మ్ చెయ్యకుండా తీసుకొని వెళ్లి సొంత పనులు చేసుకోవడము తప్పు మరియు అన్యాయం. దానిని సమర్ధించడము ఇంకా తప్పు. ఇది చిన్నగంజాం గ్రామ మరియు చిన్నగంజాం మండల రక్షణ విషయము. గ్రామానికి బయటి వ్యాపారులు వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడము పరిపాటి. ఇలాంటి స్వేచ్చకీ ఆటంకము కలిగించడము క్షమిచారాని నేరం. చిన్నగంజాం పోలీస్ వారు చాకచక్యముతో ఈ అన్యాయాన్ని  నివారించి మరలా గ్రామములో శాంతిని రిస్టోర్ చేసినందుకు నా అభినందనలు. "సాహా చిన్నగంజాం పోలీస్".  చిన్నగంజాం అంటే ఒక స్వేచ్చా విపణి. తరతరాలుగా ఈ మంచి పేరు మన ఆయుధం. మనము పాటించే శాంతి సుస్థిరత వలన మనకు వచ్చిన మంచి అధికారులు కూడా ఎక్కువకాలం మన గ్రామము లోనే ఉండటానికి ఇష్టపడుతారు.  చిన్నగంజాం పోలీసు వారికి మరలా మరలా నా ధన్యవాదములు మరియు అభినందనలు.   అన్యాయాన్ని సమర్ధించడం అన్యాయం చెయ్యడముకన్నా పెద్ద తప్పు. మనము అన్యాయాన్ని ప్రశ్నించని రోజు అన్యాయాన్ని చ...

పేద వారు పెద్ద వారైతే యెట్లా?

పూర్వం రాజులు ఆ తరువాత భూస్వాములు ప్రజలను తమ చెప్పు చేతలలో ఉంచుకొని బానిసత్వాన్ని పెంచి పోషించి ప్రజల కష్టం మీద బ్రతుకుతూ, ఆ విషయం ప్రజలకి తెలియకుండా రాజ్య పరిపాలన అనే మాటను అడ్డు పెట్టుకొని కాలం నెట్టుకొచ్చారు. కాల క్రమేణా రాజ్యాలు, భూస్వాములు ప్రజల ధాటికి కొట్టుకొని పోయి మనుగడ సాదించలేక కొత్త ముసుగుతో వేషం మార్చారు. మనం వారిని ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అంటున్నాము. సంక్షేమ పధకాలు ప్రజలకోసం తెచ్చాము అంటారు కానీ, తరువాత మన పార్టీ పర పార్టీ అని మనలో మనకు బేధాలు సృష్టిస్తారు. అంతలోనే వారి పార్టీ  లో కూడా పలానా వారు ఎక్కువ ఖర్చు పెట్టారు అని అక్కడ కూడా పెద్దపీట నాయకులకే వేస్తారు. పూరెస్ట్ అఫ్ పూర్ అనే మాటకి అర్ధాలు మార్చారు. అసలు, సంక్షేమ పధకాలు పేద ప్రజలకి అన్న విషయం మరచి పోయి, పెద్ద వారికే అన్నట్టు గా వ్యవహరిస్తారు. ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే పర పార్టీ ముద్ర వేస్తారు. అయినా కానీ ఎన్నికలలో మళ్లి వారే డబ్బుతోనో లేక మద్యం తోనో  గెలుస్తారు. పేద వారు పెద్ద వారైతే యెట్లా? మా మోసాలు తెలిసి మాకు ఎదురు తిరిగితే ఇప్పుడు వున్నా రాజకీయ ముసుగు తీసి వేసి ఇంకొక ముసుగు వ...

తెల్లచొక్కాల వలన ప్రభుత్వ వ్యతిరేకత

నాకు ఎన్నో రోజుల నుండి ఇది ఒక ఒక కొరకరాని కొయ్యగా వుంది. చంద్రబాబు గారు మరియు మోడీ గారు చాలా సీరియస్ గా రోజువారీ పేపర్లో ప్రజలకి తెలియజేసే విషయాలు తెల్లచొక్కాలకి వర్తించవా? చంద్రబాబు (గౌరవ AP సీఎం గారు) ప్రకటన : ప్రజలు బ్రతుకుదెరువు కోసం రాజకీయాలకి రాకూడదు.   చంద్రబాబు (గౌరవ AP సీఎం గారు) ప్రకటన : సంక్షేమ పథకాలలో వివక్ష ఉండకూడదు. స్వపక్షానికి మరియు విపక్షానికి అందరికి అందాలి.  మరి మా మండలం లో ఇలా ఎందుకు జరగడము లేదు. ఇదేమి అన్యాయం అని అడిగిన సర్పంచిని కొట్టించి అడ్డు వచ్చిన ప్రజలని పోలీసులతో సన్మానాలు చేయిస్తున్న తెల్ల చొక్కాలకి చంద్రబాబు గారి మాటలు ఎందుకు వినబడటము లేదు?   చివరికి తెల్లచొక్కాల వలన ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా అధిష్టానం నోరు మెదపనంతటి బలహీనత ఎక్కడ వుంది? ఏమో నాకేటి తెలుసు, ఆ శివయ్య ఏటనుకొంటున్నాడో ఏటో? ...    

కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు కూడా తెల్ల చొక్కాల పాలు...

ఇది తెల్ల చొక్కాల అంతం. కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు  కూడా తెల్ల చొక్కాల పాలవుతుంటే చూస్తూ ఊరుకోలేక ప్రభుత్వ పధకాలు పేద ప్రజలకి అందించాలి అన్న ఒకే ఒక ధ్యేయం తో మన పోలకం శరభయ్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. MRO ఆఫీస్ దగ్గరలో ఒక ఆఫీస్ ఓపెన్ చెయ్యడము జరుగింది. ప్రభుత్వ పధకాల కోసం ధరకాస్తు చేసుకొనే వారికి చేయూత నిస్తుంది. తెల్ల చొక్కాల ఉనికిని ప్రశ్నిస్తుంది. ప్రజల సంపదకు కాపు కాస్తుంది. రండి, చేయిచేయి కలుపుదాం. తెల్ల చొక్కాల అంతు చూద్దాం!!! జై హింద్, శరభయ్య పోలకం

ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు

ఎన్నో సంవత్సరాల మేధో మథనం, ఎందరో కలల స్వప్నం చిన్నగంజాం మండలం ప్రజల ఐఖ్య వేదిక మన ట్రస్ట్. ఇన్ని రోజుల పాద యాత్ర ఎన్నో జవాబు లేని ప్రశ్నలకి సమాధానాలు వెతికింది. ఊరంతా బ్రహ్మ రధం పట్టింది, తెల్లచొక్కాలకి చమటలు పట్టించింది. ఎన్నో బెదిరింపులు, ఫ్లెక్సీల పై ప్రతాపాలు, వెరసి వెగటు పుట్టించే గల్లీ నాయకుల రంగులు, సామాన్యుల పై వారి దాష్టికాలు. ఏమి చెయ్యలేని సామాన్యుల అచేతన స్థితి. నేను తెలుసుకొన్న విషయాలు ఒక్కొక్కటి గా ఫేసుబుక్ సాక్షి గా ప్రజల కి తెలియచేయటం నా విధిగా భావించి ఈ సిరీస్ ని ప్రారంభిస్తున్నాను. మొదటిగా స్వచ్ఛ భారత్ మిషన్ ,  ఎంతో గర్వించదగ్గ ఒక కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రజల క్షేమం మరియు ఆరోగ్యం కోసం పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం, స్వార్ధ పరుల చేతుల్లో చేవ చచ్చి చతికిల పడటం చూస్తుంటే వ్యవస్థ మీద అసహ్యం వేస్తుంది.  దగ్గర వుండి ప్రజల డబ్బు పరుల పాలు కాకుండా చూడవలసిన ప్రజా ప్రతినిధులు, ప్రజలకి  చెందవలసిన ఈ పధకాన్ని ఒక పధకం ప్రకారం దోచుకుంటుంటే చూస్తూ ఊరుకొంటున్న ప్రభుత్వ యంత్రంగం, మీడియా ల మీద వున్నా కించిత్తు గొరవం కాస్తా గంగ పాలు కాక...

మా ఊరిలో రైతులు సంపాదించనంత డబ్బు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ కూర్చొనే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు...

జీవనోపాధికి రాజకీయాలకి రాకపోతే మరి మా ఊరిలో ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు సంపాదించనంత డబ్బు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ  చెట్టుకింద కూర్చొనే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు,  వాళ్ళకి ఎకరాలు ఎలా వస్తున్నాయి? రాజకీయ నాయకుల వార్తలు రాసే న్యూస్ విలేకర్లకు ఆస్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి. న్యూస్ పేపర్ ఓనర్స్ కి డబ్బులు ఎక్కవ వుండి  విలేకర్లకు ఊరకనే లక్షలు, కోట్లు ఇస్తున్నారేమో. ఏమో ఎవరికి  ఎరుక. ఆ శివయ్య ఏమి  అనుకుంటున్నాడో నాకేమి ఎరుక. చంద్రబాబు గారు, మరి జనాలంతా రాజకీయ నాయకులు ఫాలోయర్స్  లేక విలేకర్లు  అయ్యేలోపే ఏదో ఒకటి చెయ్యండి. లేకపోతే పని చేసే వాళ్ళు కరువయి మనము ఇంకొక లోకం నుండి మనుష్యుల్ని దిగుమతి చేసుకోవాలి. జై హింద్ శరభయ్య పోలకం 

తెలియకుండానే మన పిల్లల్ని మనమే చెడు త్రోవలో కి సాగానంపుతున్నమా?

మగధీర, సినిమా ఎన్ని సార్లు చూసానో. ఒక చిన్న విషయం నన్ను బాగా గాబరా పెట్టింది.  షేర్ఖాన్  ఒక పెద్ద కత్తితో ఒక పెద్ద సైన్యం తో చిన్న పెద్ద రాజ్యాలన్నిటిని జయిస్తుంటాడు. గెలిచేవాడికి బాగానే వుంటుంది. కాని ఆ గెలుపు కోసం ఎంత మంది ప్రాణాలు ఆవిరి అని తలుచుకొంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. ఓడిన ఆ రాజ్యం, నివాసం ఉంటున్న ప్రజలు అన్ని మరల యధాస్థితికి రావాలంటే ఎంత సమయం తీసుకుంటుందో చెప్పలేని స్థితి.  ఒక్కడి కోసం ఇందరి బలి పాపం ఆ రోజుల్లో ప్రజలు ఇది ఎలా భరించారు అని భాధ, అమ్మో ఒకవేల ఇలాంటివి ఇప్పుడు జరిగితే ఎలా అని భయం వేసింది. కొన్ని రాజ్యాలు ఏకంగా కుర్ర్రకారుని కోల్పోయి క్రమీణ అంతరించి అన్నది చారిత్మాతక నిష్టూర సత్యం. ఆ రోజుల్లో ఒక బలాడ్యుడు సాగించిన వికృత క్రీడకి నిలువెత్తు నిదర్శనాలు ఇవన్నీ. కాని ప్రజలు బలవంతులయ్యారు.  అన్యాయాన్ని నిదేసే రోజులు వచ్చాయి కాని దానితో పాటే బలాడ్యుల స్ట్రాటజీ కూడా మారింది అనిపుస్తుంది మన చిన్నగంజాంలో రాజకేయ క్రీడ కి బలయ్యిన యూత్ ని సూస్తుంటే. తెలియకుండానే మన పిల్లల్ని మనమే చెడు త్రోవలో కి సాగానంపుతున్నమా? ఒక్క క్షణం ఆగి అడుగుదామని పిం...

విఠల్! సార్ పోయి, చీటింగ్! సార్ వచ్చారు!!!

శరభయ్య! ఎంతకాలం అయ్యిందిరా నిన్ను చూసి, నవ్వుతూ విఠల్ మాస్టారు గారు. నువ్వు అస్సలు మారలేదు రా. అమెరికా లో సెటిల్ అయ్యావు కదా కొంచెం మారి ఉంటావు అనుకొన్నాను నవ్వుతూ అన్నారు మాస్టారు గారు. దాదాపు 30 సంవత్సరముల తరువాత చూస్తున్నాను విఠల్ సార్ ని. నమస్తే సార్! అవును సార్ మిమ్మల్ని చూసి చాలాకాలం అయ్యింది అన్నాను. తన ఆప్యాయతలో ఏమాత్రం తగ్గని ప్రేమని చూసి మన జనరేషన్ లో ఇలాంటివాళ్ళు కరువేకదా అనిపించింది. ఇక్కడ విఠల్ సార్ గురించి రెండు మాటలు చెప్పాలి. తను మా చిన్నప్పుడు హైస్కూల్ లో టీచర్ గా  చేసే వారు. కాళీ సమయాలలో చిన్నపాటి పత్రికని నడిపేవారు. అంతేకాదు, పోలీస్ స్టేషన్ లో ఒక గంట పాటు కూర్చొని పోలీసులతో పిచ్చాపాటి మాట్లాడేవారు. నాకు అర్ధం అయ్యేది కాదు, తనకు రోజూ పోలీసులతో పని ఏమి ఉంటుందో. ఒక సారి అడిగాను. సార్ మీకు తెలియని ఇన్స్పెక్టర్ లేడా? నవ్వుతూ విఠల్ సార్ అన్నారు. శరభయ్య, మనము ఊరిలో ఉంటాము, ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో తెలుస్తుంది. మరి కొత్తగా వచ్చే ఇనస్పెక్టర్ కి ఎలా తెలుస్తుంది? అందుకని నేను వాలంటీర్ గా పరిచయము పెంచుకొని వారికి ఊరిలో స్థితిగతులని తెలిపి వారి డ్యూటీ వారు...

నాకు ఒక కల ఉంది. ఈ కలని సాకారం చేసే వైపు నేను నడుస్తున్నాను.

మనం కలలు కనగలిగితే వాటిని సాధించడానికి ప్రయత్నించగలుగుతాము. నాకు ఒక కల ఉంది. చిన్నగంజాం మండలం ప్రజలంతా కలిసి కదంతొక్కి అభివృద్ధి సాదించాలి. ఐకమత్యమే మన మహా బలం.  ఈ కలని సాకారం చేసే వైపు నేను నడుస్తున్నాను.  జై హింద్ శరభయ్య పోలకం 

చిన్నగంజాం మండలం ప్రజలంతా కలిసి కదంతొక్కి అభివృద్ధి సాదించాలి. కలని సాకారం చేసే వైపు నేను నడుస్తున్నాను.

మనం కలలు కనగలిగితే వాటిని సాధించడానికి ప్రయత్నించగలుగుతాము. నాకు ఒక కల ఉంది. చిన్నగంజాం మండలం ప్రజలంతా కలిసి కదంతొక్కి అభివృద్ధి సాదించాలి. ఐకమత్యమే మన మహా బలం. కలని సాకారం చేసే వైపు నేను నడుస్తున్నాను.  జై హింద్ శరభయ్య పోలకం 

మన ప్రాంతానికి ప్రాజెక్ట్ లు ఏమి లేవు. ఇప్పుడు వస్తుంటే అడ్డు పడవద్దు

కరెంటు అనేది మానవులకి అత్యవసరమైన మౌలిక సదుపాయం. కరెంటు లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యని పరిస్థితి ఇప్పుడు. మరి ఎవరో ఒకరు ఎక్కడో ఒక పవర్ ప్లాంట్ పెట్టాలి కదా. ప్రతి ఒక్కరు మాకు వొద్దు అని అంటే మరి మనకి పవర్ ఎక్కడ నుండి వస్తుంది. ఇతర సదుపాయాలు ఎలాగో కరెంటు కూడా అలాగే. కాకపోతే పంటలు పండని బంజరు భూములును ఉపయోగించి, పవర్ ప్లాంట్ నుండి వచ్చే వ్యర్ధాలను సక్రమంగా కంట్రోల్ చెయ్యగలిగితే మంచిది. మనము కోస్టల్ ఏరియా వాళ్ళం కాబట్టి, బంజరు భూములను వుపయోగించి సముద్రపు నీరుతో వ్యర్ధాలను కంట్రోల్ చేస్తే  జెన్కో పవర్ ప్రాజెక్ట్ ఒకే. ఉదాహరణకి, మన రాజధానిని ఆనుకొని వున్న ఇబ్రహీంపట్నం థెర్మల పవర్ ప్లాంట్  ప్రపంచము లోనే గొప్ప పొల్యూషన్ లేని పవర్ ప్లాంట్. ఇప్పుడు వున్న టెక్నాలజీతో మనము బాధ్యతా యుతముగా పవర్ ప్లాంట్ కట్టుకోవచ్చు. ప్రైవేట్ పవర్ ప్లాంట్లు వాళ్ళు అయితే బాధ్యతారాహిత్యము తో వ్యవహరిస్తారుగాని, ప్రభుత్వరంగ సంస్థ ఐన జెన్ కో మంచిగా చేస్తుంది అన్నది నా అభిప్రాయం. ప్రజలు తమకు ఏది మంచిదో అది తెలుసుకొని దానినే కోరుకోవడము చాలా అవసరము. ఇవ్వాళ రేపు, ప్రతి పనికి రాళ్లు వేసే వాళ్ళు వుంటారు. ఫైనల్ ...

రాజకీయం ఇప్పుడు మీడియా సాక్షిగా అబద్దాలను ప్రచారం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతుంది

ఇన్నేళ్ళుగా గ్రామ సీమలను మభ్యపెట్టి, మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్న రాజకీయం ఇప్పుడు మీడియా సాక్షిగా అబద్దాలను ప్రచారం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతుంది. ఏది నిజం, ఏది అబద్దం అనేది సగటు జీవికి ఒక కొరకరాని కొయ్య అయ్యింది ఈనాడు. అసలు ప్రజలకి ఏమి కావాలి అన్న విషయము మీద దృష్టిపెట్టే నాయకుడు ఎక్కడ? ఎలా మోసం చేసి నిట్టనిలువునా సమాజాన్ని చీల్చి, మన వాటా ఓట్లు ఎలా రాబట్టాలి అన్న యావ మీద వున్న దృష్టి ప్రజలకి నిస్వార్థమైన సేవ చేసే విషయాల మీద పెడితే జనం మెచ్చిన నాయకుడు అవుతాడు అన్నది అక్షర సత్యం. గత 40 సంసారములు గా నేను చిన్నగంజాం మండలము లో చూస్తున్నాను. నా కంటే ముందు పుట్టి ఇంకా జన జీవన స్రవంతి లో యాక్టీవ్ గా వున్నా పెద్దలు చూస్తున్నారు. వచ్చిన ప్రభుత్వాలు చేసిన మంచి ఏమి లేదు అన్నది చిన్నగంజాం ప్రజలు ఎరిగిన సత్యం. ఒక ప్రాజెక్ట్ లేదు. ఒక ఫ్యాక్టరీ లేదు. కొన్ని గ్రామాలలో కనీసం రోడ్లు , రవాణాసౌకర్యం, కరెంటు, త్రాగునీరు సౌకర్యాలు కూడా లేవు. పబ్బం గడుపుకునే రాకీయం, స్వార్థపరులైన కొంత మంది స్థానికులని లోబరుచుకుని లబ్ది పొందుతున్నారు. ప్రజలు చైతన్యము తెచ్చుకొని గ్రామానికి ఏమి కావాలి అ...

గ్రామ సీమలకి మరల పూర్వపు వైభవం...

మన చిన్నగంజాం గ్రామ ప్రజలు తమకు వున్న ప్రతిభతో ముందుకు పోతే దారి క్లియర్ గా కనిపిస్తుంది అన్నది నా అభిప్రాయం. ఎవరో ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే చివరకి నిరాశ తప్పదు. గ్రామ సీమలకి  మరల పూర్వపు వైభవం తేవాలని  మంచి తలంపుతో నైపుణ్యాలని నేర్పించే సదుద్దేశం తో మన చిన్నగంజాం మండల  గ్రామాలలో యువత ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు.  కుట్టు మెషిన్ నైపుణ్యం. ఇది మన పెద్దగంజాం గ్రామములో 50 మంది మహిళా ఔత్సహికులుకు నేర్పించటం జరుగుతుంది. చిత్తశుద్ధి తో ఈ నైపుణ్యం నేర్చుకొంటే ఒకరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడే ఆత్మవిశ్వాసం వస్తుంది అన్నది నా నమ్మకం.  ఉత్సహం వున్న సామాజిక కార్యకర్తలు ఉదయ్ --> 950-514-2148 ని  సంప్రదించగలరు.

చిన్నగంజాం హద్దులు లేని వసుధైక కుటుంబము

అరవై చలివేంద్రాలు, అదీ చిన్నగంజాం మండలం మొత్తం. అసలు ఇది సాధ్యమేనా? అన్ని పాయింట్స్ లో ప్రతిరోజు వాటర్  నింపటానికి టైం సరిపోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలతో చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యడము జరిగింది. ఇప్పుడు ప్రజలు అంతా తామై చలివేంద్రాలని నడుపుతున్న వైనం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. చిన్న ఇన్సిడెంట్...  ఈరోజు చిన్నగంజాం రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి నుండి ఫోన్ వచ్చింది వెంకటేశ్వర రావుకి. వాటర్ సప్లై బాగుంది కానీ ట్రైన్స్ లో వచ్చిన ప్రయాణికులు ఎండలకు దాహంతో చలివేంద్రంలో చల్లటి నీళ్లు త్రాగుతున్నారు. మధ్యాహ్నం సమయానికి కుండలలో నీరు నిండుకుంటుంది. రోజుకి రెండు సార్లు నింపితే ఉపయోగంగా ఉంటుంది. ఇది రిక్వెస్ట్. రోజుకి రెండు సార్లు మండలం మొత్తం వాటర్ కుండలలో నింపటం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. వెంటనే వెంకటేశ్వర రావు కి ఒక ఐడియా వచ్చింది. రోజు ఉదయం కుండలలో నీరు నింపే సమయము లోనే ఇంకొక 3 క్యాన్లు ఎక్సట్రా ఇచ్చి పాయింట్లో వున్న వాలంటీర్స్ కి అప్పగించడము. కుండలలో నీరు అయిపోయిన తరువాత, ఈ క్యాన్లలో వున్న నీటిని కుండలలో కి ఈ వాలంటీర్స్ నింపుతారు. ...
నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి చిన్నగంజాం మార్కెట్ లో చాపలు, రొయ్యలు మరియు కొన్ని ఆకు కూరలు ఎప్పుడు తూకం వేసి అమ్మ లేదు ఎవ్వరును. అలా ఎందుకు చేయ్యరో ఒక్కసారి ఆలోచిద్దాము. 1) మత్స్యకారులు మరియు ఇతరులు ఎంతో శ్రమకోడ్చి వేట లో పడిన సరుకు మార్కెట్ కి తెస్తారు. అక్కడ వెంటనే చిన్నపాటి చిల్లర వ్యాపారులకు అమ్ముతారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ వేటగాళ్లు మరియు చిన్నవ్యాపారులు ఒకే కుటుంబం లాగా అన్నమాట. అంతా చిన్నగంజాం వాళ్లే  కాబట్టి ఒకరిని ఒకరు అంతగా మోసం చేసునేది ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అండ్ జగమెరిగిన సత్యం. 2) చిరు వ్యాపారులు పచ్చి సరుకు పాడై పోయే లోపులోనే అమ్మగలగాలి. ఇది చాలా స్కిల్ తో కూడు కున్న వ్యవహారం. సరుకు బాగా వున్నప్పుడు అంటే ఫ్రెష్ గా మరియు పెద్దవి అయితే రేట్ ఎక్కువకి లేకపోతే  తక్కువకి  ఇవ్వాలి. లేక పోతే సరుకు మిగిలి పోయి చిరు వ్యాపారి నష్ట పోతాడు.  ఇక్కడ చిరు వ్యాపారి అంటే రోజు వారి కూలీలే. కష్టం చేసే ఓపిక లేక పాపం ఇంత రిస్క్ చేస్తారు. 3) ఇక్కడ వినియోగదారులు కూడా రెగ్యులర్ కస్టమర్స్. చిరు వ్యాపారులకు మరియు కస్టమర్స్ కి ఇక్కడ వున్న సంబంధం...

పని కట్టుకొని పల్లెలను విడదీసింది ఎవరు?

చివరకి చిత్తు కాగితాలు ఏరుకొనే వారికి కూడా సంఘాలు వున్నాయి, కాని మన గ్రామీణ ప్రజలలో సంఘస్ఫూర్తి లోపించింది అన్న కెసిఆర్ మాటలు అక్షర సత్యాలు. పని కట్టుకొని పల్లెలను విడదీసింది ఎవరు అని గట్టిగా ప్రశ్నించాలని వుంది.  సాలి, మంగలి, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, కాపు, రెడ్డి, వైశ్యాస్, అయ్యవార్లు  ఇలా సమాజాన్ని మళ్ళీ  కలవలేని స్థితికి తీసుకొని వెళ్లి ఇప్పుడు అయ్యో రామా ఇలా జరుగుతుంది ఏమిటి అని అనొకొంటే అంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకొకటి ఉండదేమో.  ప్రతి ఆరు నెలలకి వచ్చే ఏదో ఒక ఎన్నికలలో గెలుపు కోసం రాజకీయనాయకులు ఆడే ఈ రాక్షస క్రీడలో అన్యాయముగా బలి అయ్యేది గ్రామీణులే. పట్టణవాసులు ఎన్నికల రోజుని ఒక సెలవు రోజుగా ఎంజాయ్ చెయ్యటం తప్ప ఇంకా పెద్దగా పట్టించు కొని ఈ రోజులలో అడ్డంగా బలి అవుతుంది మాత్రం పాపం గ్రామీణ ప్రజానీకమే. కులం పేరుతో జనాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని గెలిచిన తరువాత మొఖం చాటువేసే నాయకుడికి తెలియకపోవచ్చు మన గ్రామాలలో ప్రజలు ఈ కులాల కొలిమిలో ఎంత కాలి పోతున్నారో. పచ్చి రక్తం త్రాగే రాక్షసులకు ఇలాంటి రాజకీయ నాయకులకి తేడా ఏమిటి? మరి ఈ క్రీడ కి మనం బ...

చిన్నగంజాం మండలం ప్రజలు చేసిన పాపం ఏమిటి?

మన చిన్నగంజాం మండలం అనాదిగా నిర్లక్ష్యానికి గురిఅయిందనేది నిష్ఠూర సత్యం. కుల ప్రాతిపదికన ప్రజలను ముక్కలుగా విడదీసి, ఓట్లు  సంపాదించుకొనే శ్రద్ధ ఆశక్తులు, మండల అభివృద్ధి మీద చూపించక పోవడము చోచనీయం. గ్రామాలలో ఒక విధమైన నిర్జీవ వాతావరణం కనబడుతుంది. స్వీయ నియంత్రణ తో స్వయంగా అభివృద్ధి సాధించడానికి సాయం అందించడము లో కూడా ఎన్నికలలో గెలిచిన నాయకులు ముఖం చాటు వేయడముతో, ప్రజలు విసిగి వేసారి పోయారు. మేము చేసిన పాపం ఏమిటి అని కుములి పోతున్నారు. ఇది అనాది గా మనము చూస్తున్నదే, కాని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? మనల్ని మనం అడగవలసిన ప్రశ్న ఇది. 1) గెలిచిన నాయకులకి కనీస విషయ పరిజ్ఞానం లేక పోవడము. సిస్టం ఎలా పని చేస్తుంది. మన ప్రజలకి న్యాయ పరంగా రావలిసిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా సాదించుకోవడము అనేది తెలిసి ఉండాలి. సాధిచడానికి సమయము పెట్టాలి. 2) ఒక వేల రాష్త్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్ట పరిస్థితులలో ఉంటే, సమస్యల పరిష్కారానికి, కేసు బిల్డ్ చేసి మంత్రులకి ప్రెజెంట్ చేసి మన సమశ్యల మీద అనుకూల నిర్ణయం వచ్చే విధముగా చేసే పరిజ్ఞానము కూడా ఉండాలి.  ...
మన చిన్నగంజాం మండల గ్రామాలలో వేసవి దాహార్తిని జయించే బృహత్తు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ఈ క్రింది గ్రామస్థులకు నా హృదయపూర్వక అభినందనలు. -జై హింద్ శరభయ్య పోలకం 1) అమీన్ నగర్ - రామాలయం 2) రాజుబంగారుపాలెం - జాలమ్మ చెట్టు 3) కుక్కలవారి పాలెం - భ్రంహం గారి గుడి 4) కుక్కలవారి పాలెం - యానాదిసంగం 5) కుక్కలవారి పాలెం - కనకదుర్గమ్మ గుడి 6) చిన్నగంజాం - రైల్వే స్టేషన్ 7) చిన్నగంజాం - మార్కెట్ సెంటర్ 8) చిన్నగంజాం - అంబేద్కర్ సెంటర్ 9) చిన్నగంజాం - కన్యకాపరమేశ్వరి టెంపుల్ 10) చిన్నగంజాం - తాటి సుబ్బారావు గారి ఇల్లు 11) చిన్నగంజాం - రైల్వే గేట్ సెంటెర్ 12) చిన్నగంజాం - మండల కార్యాలయం 13) రామచంద్రానగర్ 14) బాపయ్య నగర్ 15) పెద్ద పల్లెపాలెం - ఎన్టీఆర్ బొమ్మ 16) పెద్ద పల్లెపాలెం - రాములవారిగుడి 17) పడమట పల్లె పాలెం - రచ్చబండ 18) తూర్పు పాలెం 19) మున్నవారిపాలెం 20) చిన్నగంజాం - బండ కాలనీ 21) మూలగానివారి పాలెం 22) కొత్తపాలెం - Dr. ఆనంద్ గారి కొట్టారు 23) కడకుదురు - బస్సు స్టాండ్ 24) కడకుదురు - రామాలయం 25) కడకుదురు - కృష్ణుడి గుడి 26)  కడకుదుర...

వేసవికాలం దాహం కాలం. రండి జయిద్దాం!!!

చిన్నగంజాం మండల్ పరిధి లోని గ్రామాలలో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేయాలి అని భావించే సామజిక కార్యకర్తలుకు ఓక శుభవార్త. మీరు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడానికి కావలసిన సామాగ్రిని అందచడానికి చిన్నగంజాం గ్రామ ప్రజలు కలసి నిర్మించిన సుజల స్రవంతి నిర్వాహకులు చేయూతనిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం మరియు మధ్యాహ్నం శుద్ధ త్రాగునీరు టాంకర్ తో  మీ చలివేంద్రం లో  మట్టి కుండలలో నీరు నింపటానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఔత్సహికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని దాహార్తులకు హాహం తీర్చమని ప్రార్ధన.  జై హింద్  శరభయ్య పోలకం       

Media Literacy

పత్రికలలో వచ్చే వార్తలు ముఖ్యముగా ఈ క్రింద విధముగా రాస్తారు. 1) వార్త ఎందుకు, ఎలా మరియు  ఏ పర్పస్ కోసం రాయాలి.  2) వార్తని వ్యక్తులు ఎలా అర్ధం చేసుకొంటారు? సామాజిక సాంప్రదాయాలు వార్తని ఎలా ప్రభావితం చేస్తాయి? వ్యకి నమ్మకాలని మరియు ప్రవర్తనని ఎలా మారుస్తాయి అనే స్పృహ ఉండేలా వుందా? 3) వార్త మన చుట్టూ  వున్న ధర్మ బద్దమైన మరియు న్యాయ బద్దమైన ఇష్యూ మీద ప్రాధమిక విషయం జ్ఞానాన్ని అందించేలా వుందా?   ఇలా రూపుదిద్దుకున్న క్వాలిటీ వార్తలతో మనకు స్వతంత్రం వచ్చింది, అనేక దేశాలలో ప్రజలు తమకు నచ్చిన రాజ్యాలను సాధించుకొన్నారు. చివరకి అమెరికా అధ్యక్షుడికి కూడా దడ పుట్టించే నిబద్దత సొంతమని చాటించింది మీడియా.  కానీ ఇలాంటి నిర్మొహమాటమైన వార్తలు రాయడానికి ఉన్నత చదువులతో పాటు సంస్కారం, దేశసేవ, సామాజిక స్పృహ లాంటివి విలేఖరికి లేదా రిపోర్టర్స్ కి తప్పకుండ ఉండాలి. మరి మన చుట్టూ తిరుగుతున్న విలేకర్లకు ఇలాంటివి ఉన్నాయా? ఏ చదువు అబ్బని మరియు ఏ ఉద్యోగం రాని, ఎందుకు కొరగాని వారు విలేకరి అవతారమెత్తితే ఏమై పోవాలి మన సమాజం? అసలు ఇన్ని మాస్ కమ్యూనికేషన్...

మీసేవ ప్రభుత్వం ప్రజలకి కల్పించిన సర్వీస్ కాదా?

చిన్నోడా ఆ కరెంటు బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు పొలం వెళ్ళాను, కరెంటు బిల్ కట్టలేదు. కొంచెం కరెంటు ఆఫీస్ కి వెళ్లి బిల్ కట్టిరా. బిల్ కలెక్టర్ సాయంత్రం వస్తాడు కడతానులే సమాధానం ఇచ్చిన రోజునే బిల్ కట్టి బిల్ కాగితం ఇంట్లో ఇచ్చాను. రాను రాను జనాలు పెరిగారు, కనెక్షన్స్ పెరిగాయి. కానీ బిల్ కలెక్టర్లు ని పెంచడం ప్రభుత్వానికి తలకి మించిన పని అయ్యింది.  పనికి ఆహరం పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉద్యోగ కల్పనలో చూపించలేక పోయింది. ఫలితం, మీసేవ...  ఇలాంటి సేవలన్నీ, ప్రభుత్వం చేయడానికి ఉద్యోగులు అవసరం, కానీ మన ప్రభుత్వాలు అక్కడ పొదుపు సూత్రం గట్టిగా పాటించి మీసేవ అనే ప్రైవేట్ / పొరుగు సేవల కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అక్కడే పొరుగు సేవల నిర్వాహకుల విషయము లో మంచి సుద్ధ పప్పులో కాలు వేసింది.   మీసేవ నిర్వాహకులు సేవని వ్యాపారం చేయడానికి ఎన్నో ఎక్కువ రోజులు తీసుకోలేదు. Rs. 10/- తీసుకోవలసిన అప్లికేషన్ కి షుమారుగా Rs. 300/- ఛార్జ్ చెయ్యడము, అది ఒక కస్టమరీ గా మారి పోవడము జరిగిపోయింది. మరి ఆకలితో వున్నవాడిని అరిశలకి కాపలా పెట్టి అరిసెలు తినవద్దు అంటే ఎలా? కాన...