Skip to main content

మన ప్రాంతానికి ప్రాజెక్ట్ లు ఏమి లేవు. ఇప్పుడు వస్తుంటే అడ్డు పడవద్దు

కరెంటు అనేది మానవులకి అత్యవసరమైన మౌలిక సదుపాయం. కరెంటు లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యని పరిస్థితి ఇప్పుడు. మరి ఎవరో ఒకరు ఎక్కడో ఒక పవర్ ప్లాంట్ పెట్టాలి కదా. ప్రతి ఒక్కరు మాకు వొద్దు అని అంటే మరి మనకి పవర్ ఎక్కడ నుండి వస్తుంది. ఇతర సదుపాయాలు ఎలాగో కరెంటు కూడా అలాగే. కాకపోతే పంటలు పండని బంజరు భూములును ఉపయోగించి, పవర్ ప్లాంట్ నుండి వచ్చే వ్యర్ధాలను సక్రమంగా కంట్రోల్ చెయ్యగలిగితే మంచిది. మనము కోస్టల్ ఏరియా వాళ్ళం కాబట్టి, బంజరు భూములను వుపయోగించి సముద్రపు నీరుతో వ్యర్ధాలను కంట్రోల్ చేస్తే  జెన్కో పవర్ ప్రాజెక్ట్ ఒకే.

ఉదాహరణకి, మన రాజధానిని ఆనుకొని వున్న ఇబ్రహీంపట్నం థెర్మల పవర్ ప్లాంట్  ప్రపంచము లోనే గొప్ప పొల్యూషన్ లేని పవర్ ప్లాంట్. ఇప్పుడు వున్న టెక్నాలజీతో మనము బాధ్యతా యుతముగా పవర్ ప్లాంట్ కట్టుకోవచ్చు.

ప్రైవేట్ పవర్ ప్లాంట్లు వాళ్ళు అయితే బాధ్యతారాహిత్యము తో వ్యవహరిస్తారుగాని, ప్రభుత్వరంగ సంస్థ ఐన జెన్ కో మంచిగా చేస్తుంది అన్నది నా అభిప్రాయం.

ప్రజలు తమకు ఏది మంచిదో అది తెలుసుకొని దానినే కోరుకోవడము చాలా అవసరము. ఇవ్వాళ రేపు, ప్రతి పనికి రాళ్లు వేసే వాళ్ళు వుంటారు. ఫైనల్ గా, మనకు మన భావి తరాలవాళ్ళకు ఏది మంచిదో అది చేస్తే మంచిదేమో.

మన ప్రాంతానికి ప్రాజెక్ట్ లు ఏమి లేవు. ఇప్పుడు వస్తుంటే అడ్డు పడవద్దు . ఏవిధముగా ఉంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆలా చెయ్యమని డిమాండ్ చెయ్యడము మాత్రం మరవ వద్దు .

మీకు త్రినాధ్రెడ్డి గారు మార్గదర్శకులు గా ఉండగలరని ఆశిస్తున్నాను.       

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం