Skip to main content

మన ప్రాంతానికి ప్రాజెక్ట్ లు ఏమి లేవు. ఇప్పుడు వస్తుంటే అడ్డు పడవద్దు

కరెంటు అనేది మానవులకి అత్యవసరమైన మౌలిక సదుపాయం. కరెంటు లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యని పరిస్థితి ఇప్పుడు. మరి ఎవరో ఒకరు ఎక్కడో ఒక పవర్ ప్లాంట్ పెట్టాలి కదా. ప్రతి ఒక్కరు మాకు వొద్దు అని అంటే మరి మనకి పవర్ ఎక్కడ నుండి వస్తుంది. ఇతర సదుపాయాలు ఎలాగో కరెంటు కూడా అలాగే. కాకపోతే పంటలు పండని బంజరు భూములును ఉపయోగించి, పవర్ ప్లాంట్ నుండి వచ్చే వ్యర్ధాలను సక్రమంగా కంట్రోల్ చెయ్యగలిగితే మంచిది. మనము కోస్టల్ ఏరియా వాళ్ళం కాబట్టి, బంజరు భూములను వుపయోగించి సముద్రపు నీరుతో వ్యర్ధాలను కంట్రోల్ చేస్తే  జెన్కో పవర్ ప్రాజెక్ట్ ఒకే.

ఉదాహరణకి, మన రాజధానిని ఆనుకొని వున్న ఇబ్రహీంపట్నం థెర్మల పవర్ ప్లాంట్  ప్రపంచము లోనే గొప్ప పొల్యూషన్ లేని పవర్ ప్లాంట్. ఇప్పుడు వున్న టెక్నాలజీతో మనము బాధ్యతా యుతముగా పవర్ ప్లాంట్ కట్టుకోవచ్చు.

ప్రైవేట్ పవర్ ప్లాంట్లు వాళ్ళు అయితే బాధ్యతారాహిత్యము తో వ్యవహరిస్తారుగాని, ప్రభుత్వరంగ సంస్థ ఐన జెన్ కో మంచిగా చేస్తుంది అన్నది నా అభిప్రాయం.

ప్రజలు తమకు ఏది మంచిదో అది తెలుసుకొని దానినే కోరుకోవడము చాలా అవసరము. ఇవ్వాళ రేపు, ప్రతి పనికి రాళ్లు వేసే వాళ్ళు వుంటారు. ఫైనల్ గా, మనకు మన భావి తరాలవాళ్ళకు ఏది మంచిదో అది చేస్తే మంచిదేమో.

మన ప్రాంతానికి ప్రాజెక్ట్ లు ఏమి లేవు. ఇప్పుడు వస్తుంటే అడ్డు పడవద్దు . ఏవిధముగా ఉంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆలా చెయ్యమని డిమాండ్ చెయ్యడము మాత్రం మరవ వద్దు .

మీకు త్రినాధ్రెడ్డి గారు మార్గదర్శకులు గా ఉండగలరని ఆశిస్తున్నాను.       

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం