Skip to main content

చిన్నగంజాం హద్దులు లేని వసుధైక కుటుంబము


అరవై చలివేంద్రాలు, అదీ చిన్నగంజాం మండలం మొత్తం. అసలు ఇది సాధ్యమేనా?
అన్ని పాయింట్స్ లో ప్రతిరోజు వాటర్  నింపటానికి టైం సరిపోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలతో చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యడము జరిగింది. ఇప్పుడు ప్రజలు అంతా తామై చలివేంద్రాలని నడుపుతున్న వైనం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది.

చిన్న ఇన్సిడెంట్...  ఈరోజు చిన్నగంజాం రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి నుండి ఫోన్ వచ్చింది వెంకటేశ్వర రావుకి. వాటర్ సప్లై బాగుంది కానీ ట్రైన్స్ లో వచ్చిన ప్రయాణికులు ఎండలకు దాహంతో చలివేంద్రంలో చల్లటి నీళ్లు త్రాగుతున్నారు. మధ్యాహ్నం సమయానికి కుండలలో నీరు నిండుకుంటుంది. రోజుకి రెండు సార్లు నింపితే ఉపయోగంగా ఉంటుంది. ఇది రిక్వెస్ట్. రోజుకి రెండు సార్లు మండలం మొత్తం వాటర్ కుండలలో నింపటం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. వెంటనే వెంకటేశ్వర రావు కి ఒక ఐడియా వచ్చింది. రోజు ఉదయం కుండలలో నీరు నింపే సమయము లోనే ఇంకొక 3 క్యాన్లు ఎక్సట్రా ఇచ్చి పాయింట్లో వున్న వాలంటీర్స్ కి అప్పగించడము. కుండలలో నీరు అయిపోయిన తరువాత, ఈ క్యాన్లలో వున్న నీటిని కుండలలో కి ఈ వాలంటీర్స్ నింపుతారు.

అద్భుతం, ప్రాబ్లెమ్ పరిష్కరించబడింది. ప్రజలు స్వచ్చందము ముందుకు వచ్చి వేసవికాలాన్ని ఇలా జయించడము ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఈవిదంగా ప్రతి పల్లె పోటీ పడి  మరీ ప్రజల దాహార్తిని తీర్చడము ఒక శుభపరిణామము. చిన్నగంజాం హద్దులు లేని వసుధైక కుటుంబము కావడానికి ఇంకా ఎంతో సమయము పట్టదు అని నా నిశ్చితాభిప్రాయం.

సప్త సముద్రాల ఆవల వున్నా, నా జనులకి ఈ చిన్ని పాటి ఉడతా సాయం అందిచే శక్తి ని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి నేను సదా సేవకుడినై వుంటాను.

జై హింద్
శరభయ్య పోలకం    

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం