Skip to main content

Media Literacy

పత్రికలలో వచ్చే వార్తలు ముఖ్యముగా ఈ క్రింద విధముగా రాస్తారు.

1) వార్త ఎందుకు, ఎలా మరియు  ఏ పర్పస్ కోసం రాయాలి. 

2) వార్తని వ్యక్తులు ఎలా అర్ధం చేసుకొంటారు? సామాజిక సాంప్రదాయాలు వార్తని ఎలా ప్రభావితం చేస్తాయి? వ్యకి నమ్మకాలని మరియు ప్రవర్తనని ఎలా మారుస్తాయి అనే స్పృహ ఉండేలా వుందా?

3) వార్త మన చుట్టూ  వున్న ధర్మ బద్దమైన మరియు న్యాయ బద్దమైన ఇష్యూ మీద ప్రాధమిక విషయం జ్ఞానాన్ని అందించేలా వుందా?  

ఇలా రూపుదిద్దుకున్న క్వాలిటీ వార్తలతో మనకు స్వతంత్రం వచ్చింది, అనేక దేశాలలో ప్రజలు తమకు నచ్చిన రాజ్యాలను సాధించుకొన్నారు. చివరకి అమెరికా అధ్యక్షుడికి కూడా దడ పుట్టించే నిబద్దత సొంతమని చాటించింది మీడియా. 

కానీ ఇలాంటి నిర్మొహమాటమైన వార్తలు రాయడానికి ఉన్నత చదువులతో పాటు సంస్కారం, దేశసేవ, సామాజిక స్పృహ లాంటివి విలేఖరికి లేదా రిపోర్టర్స్ కి తప్పకుండ ఉండాలి. మరి మన చుట్టూ తిరుగుతున్న విలేకర్లకు ఇలాంటివి ఉన్నాయా? ఏ చదువు అబ్బని మరియు ఏ ఉద్యోగం రాని, ఎందుకు కొరగాని వారు విలేకరి అవతారమెత్తితే ఏమై పోవాలి మన సమాజం? అసలు ఇన్ని మాస్ కమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్ నుండి వస్తున్న వేలాది మంది కి ఇలాంటి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడము లేదు?

1) ప్రొఫెషనల్ విలేఖరికి ఎక్కువ శాలరీ ఇవ్వాలి. వార్తలని అమ్ముకొనే ఈ రోజులలో ఇంత మొత్తం ఇచ్చి విలేకరి ఉద్యోగంలో పెట్టడము కత్తి మీద సాము. స్వార్ధానికి మరో రూపం ఈనాటి దినపత్రిక...  

2) నిజమైన వార్త చేదుగా ఉంటుంది.  పత్రిక యజమానికి మరియు కొమ్ముకాసే పార్టీలకి. కాబట్టి నిజమైన విలేకర్లు ఇక్కడ పనికి రారు. వారికి నచ్చే వార్త రాసే వారికే పెద్ద పీట. స్వార్ధానికి మరో రూపం ఈనాటి దినపత్రిక...  

ఇన్ని ఇబ్బందులు దేనికి? కొంచెం శాలరీతో ఎవరో ఒకరిని పెట్టేస్తే పోలా? పర్యవస్తానం, మన చుట్టూ వున్న చెత్త. కానీ ఇక్కడే అసలుకే మోసం. ఏదో ఒకటి రాస్తారులే అని విలేఖరులని పెట్టుకొన్న పత్రికలకి ఈ రోజు ఒక షాకే. మన విలేకరి ముసుగు వేసుకొన్న చెత్త, కొత్త పోకడలు బహుశా ఎవరి ఊహకి అంది ఉండదేమో?

1) గ్రామాల గొడవలోకి విలేకరిగా ఎంటర్ అయ్యి పంచాయితీలు చెయ్యడము నేర్చుకొన్నారు మన ఈనాటి విలేకర్లు. ఊరిలో వారే విలేకరి గా వుండటము వలన ఈ దౌర్భాగ్యము వచ్చిందేమో పత్రిక యజమానులు చూడలిసిన అవసరము వచ్చింది ఇప్పుడు. 

2) ప్రభుత్వ పధకాలు పేదలకి చెందకుండా కొంతమంది పార్టీలో వున్న చోటా కార్య కర్తలు పంచుకొంటుంటే కాదని చెప్పి వారిని సరిఅయిన దారిలో పెట్టాలిసిన విలేకర్లు వాటా కోసం పోటీ పడితే మరి మన ఫోర్త్ ఎస్టేట్ ఏమైపోయింది? ఊరిలో వారే విలేకరి గా వుండటము వలన ఈ దౌర్భాగ్యము వచ్చిందేమో పత్రిక  యజమానులు చూడాలిసిన అవసరము వచ్చింది ఇప్పుడు. 

3) ప్రజలకి సౌకర్యాలు కల్పించాలిసిన MRO, MDO లాంటి ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ కలిపించాలిసిన పోలీసు వ్యవస్థని కూడా బ్లాక్మెయిల్ చేసేటంత వరకు విలేకర్లు వచ్చారంటే మనము ఎటు పోతున్నాము ఊరిలో వారే విలేకరి గా వుండటము వలన ఈ దౌర్భాగ్యము వచ్చిందేమో పత్రిక  యజమానులు చూడాలిసిన అవసరము వచ్చింది ఇప్పుడు.

4) చివరికి చిన్న పిల్లలకి పోషకాహారం అందించాలిసిన అంగన్వాడీ కూడా వీరి కబ్జాకి బలి అవుతుంటే చూస్తూ ఊరుకొంటే రేపు మన ఇంటిలోకి వచ్చిన ఆపలేము ఏమో? 

చిన్నగంజాం ప్రజలకి నా విన్నపం. మన సమస్యలని మనమే పరిష్కరించుకొందాము. చేయి చేయి కలుపుదాం, ప్రతి ఒక్కరు ఒక వేగు అవుదాము. విలేకర్లు చేసే ధాష్టీకాలనీ నేరుగా జిల్లా స్థాయి అధికారులకి తెలియ జేయండి. జిల్లా స్థాయి అధికారులని ఎలా కలవాలో తెలుసుకోవాలంటే నాకు ఫేసుబుక్లో ప్రైవేట్ మెసేజ్ పెట్టండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను.

నిన్నటి చిన్నగంజాం ని మళ్లి రేపు చూద్దాము, రండి, పోయేదేముంది ఈ చెత్త వార్తలు తప్ప... 



జైహింద్
శరభయ్య పోలకం   
 

  

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం