Skip to main content

విఠల్! సార్ పోయి, చీటింగ్! సార్ వచ్చారు!!!

శరభయ్య! ఎంతకాలం అయ్యిందిరా నిన్ను చూసి, నవ్వుతూ విఠల్ మాస్టారు గారు. నువ్వు అస్సలు మారలేదు రా. అమెరికా లో సెటిల్ అయ్యావు కదా కొంచెం మారి ఉంటావు అనుకొన్నాను నవ్వుతూ అన్నారు మాస్టారు గారు. దాదాపు 30 సంవత్సరముల తరువాత చూస్తున్నాను విఠల్ సార్ ని.

నమస్తే సార్! అవును సార్ మిమ్మల్ని చూసి చాలాకాలం అయ్యింది అన్నాను. తన ఆప్యాయతలో ఏమాత్రం తగ్గని ప్రేమని చూసి మన జనరేషన్ లో ఇలాంటివాళ్ళు కరువేకదా అనిపించింది.

ఇక్కడ విఠల్ సార్ గురించి రెండు మాటలు చెప్పాలి. తను మా చిన్నప్పుడు హైస్కూల్ లో టీచర్ గా  చేసే వారు. కాళీ సమయాలలో చిన్నపాటి పత్రికని నడిపేవారు. అంతేకాదు, పోలీస్ స్టేషన్ లో ఒక గంట పాటు కూర్చొని పోలీసులతో పిచ్చాపాటి మాట్లాడేవారు. నాకు అర్ధం అయ్యేది కాదు, తనకు రోజూ పోలీసులతో పని ఏమి ఉంటుందో.

ఒక సారి అడిగాను. సార్ మీకు తెలియని ఇన్స్పెక్టర్ లేడా? నవ్వుతూ విఠల్ సార్ అన్నారు. శరభయ్య, మనము ఊరిలో ఉంటాము, ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో తెలుస్తుంది. మరి కొత్తగా వచ్చే ఇనస్పెక్టర్ కి ఎలా తెలుస్తుంది? అందుకని నేను వాలంటీర్ గా పరిచయము పెంచుకొని వారికి ఊరిలో స్థితిగతులని తెలిపి వారి డ్యూటీ వారు సక్రమముగా నిర్వర్తించడానికి నా వంతు సహాయం నేను చేస్తాను. నిస్వార్ధ సేవకి నిలువెత్తు రూపం మా మాస్టారు. నాకు ఒక్క క్షణం గర్వము తో చాతి పొంగింది.

మొన్న సీఐ శ్రీనుని అడిగాను. మరి వినుకొండలో ఇలాంటి సార్లు నీకు హెల్ప్ చేస్తున్నారా అని. శ్రీను నవ్వి అన్నాడు. మామ నువ్వు మరీ సత్తె కాలంలో వున్నావు. ఇప్పుడు విఠల్ సార్ లాంటి వారు పోయారు. ఇప్పుడు చీటింగ్ సార్లు వచ్చారు. ప్రజలు ఒక సమస్య ని మా ముందుకు తెస్తే, దానిని సాల్వ్ చేసే లోపే చీటింగ్ సార్ వచ్చి, నేను పాలనా MLA మనిషిని, మీ ముందు వున్న సమస్యని పట్టించుకోవద్దు అని వార్నింగ్ ఇస్తారు. కొంత కాలం ఆలా నానాక, మన చీటింగ్ సార్ ప్రజల దగ్గరకి వెళ్లి, మరి ఇనస్పెక్టర్ కి కొంచెం చెయ్యి తడిపితే మన పని అవుతుంది అనిచెప్తాడు. ప్రజల దగ్గరనుండి వసూల్ చేసిన డబ్బుని చీటింగ్ సార్ స్వాహా చేస్తాడు. మరి విఠల్ మాస్టార్ లాంటి వారికి స్థానం లేదు కదా?

ఇదే తంతు మండల రెవిన్యూ ఆఫీస్ లో కూడా జరగడము పరిపాటి అయ్యింది. మరి ప్రతి MRO ఒక బినామీ ని పెట్టుకొని లంచావతారులవుతుంటే జనాలు ఏమి చేస్తున్నట్లు? చిన్నప్పుడు వేసిన "మంచులో రేగిన మంటలు" నాటికలో డైలాగ్ గుర్తుకొస్తుంది. "రోజులు మారాయి రంగన్న!!".  గంట రావు బావ!,  నీకు గుర్తు వుందా ఈ డైలాగ్? నువ్వు ఆ నాటిక డైరెక్టర్ వి ఆరోజుల్లో...

మన వూరిలో అలాంటి చీటింగ్ సార్లు  ఇద్దరు ఉన్నారంట. వారిలో మార్పు కోసం మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆశాభంగం చెయ్యరని ఆశిద్దాము...

జై హింద్,
శరభయ్య పోలకం


    

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం