Skip to main content

చిన్నగంజాం మండలం ప్రజలు చేసిన పాపం ఏమిటి?

మన చిన్నగంజాం మండలం అనాదిగా నిర్లక్ష్యానికి గురిఅయిందనేది నిష్ఠూర సత్యం. కుల ప్రాతిపదికన ప్రజలను ముక్కలుగా విడదీసి, ఓట్లు  సంపాదించుకొనే శ్రద్ధ ఆశక్తులు, మండల అభివృద్ధి మీద చూపించక పోవడము చోచనీయం. గ్రామాలలో ఒక విధమైన నిర్జీవ వాతావరణం కనబడుతుంది. స్వీయ నియంత్రణ తో స్వయంగా అభివృద్ధి సాధించడానికి సాయం అందించడము లో కూడా ఎన్నికలలో గెలిచిన నాయకులు ముఖం చాటు వేయడముతో, ప్రజలు విసిగి వేసారి పోయారు. మేము చేసిన పాపం ఏమిటి అని కుములి పోతున్నారు.

ఇది అనాది గా మనము చూస్తున్నదే, కాని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? మనల్ని మనం అడగవలసిన ప్రశ్న ఇది.

1) గెలిచిన నాయకులకి కనీస విషయ పరిజ్ఞానం లేక పోవడము. సిస్టం ఎలా పని చేస్తుంది. మన ప్రజలకి న్యాయ పరంగా రావలిసిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా సాదించుకోవడము అనేది తెలిసి ఉండాలి. సాధిచడానికి సమయము పెట్టాలి.

2) ఒక వేల రాష్త్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్ట పరిస్థితులలో ఉంటే, సమస్యల పరిష్కారానికి, కేసు బిల్డ్ చేసి మంత్రులకి ప్రెజెంట్ చేసి మన సమశ్యల మీద అనుకూల నిర్ణయం వచ్చే విధముగా చేసే పరిజ్ఞానము కూడా ఉండాలి.  ఇలాంటి వారిని మనము ఎన్నుకోవాలి.

3) గెలిచిన నాయకుడి చుట్టూ  తిరిగే వాళ్ళని కూడా నాయకుడు ఒక కంట కనిపెడితే అన్యాయాల్ని నిలిపిన వాళ్లవుతారు. లేకపోతే మన ఊరిలో పేద ప్రజల వారసత్వ సంపదను ఇంకొక ఊరి నాయకురాలు అన్యాయంగా స్వాధీనము చేసుకొంటుంది. బంధు ప్రీతి మరియు పార్టీ మీద వ్యామోహం లేని నాయకుడుని ఎన్నుకోవాలి.

4) పేద ప్రజల కోసం ప్రభుత్వము అమలు చేసే పధకాలు, చెట్టుకింద తెల్ల చొక్కాలు లేక పచ్చ చొక్కాల పాలవుతాయి. ప్రభుత్వము సైకిల్ లేని వాడికి సైకిల్ ఇవ్వమంటే, మోటార్ సైకిల్ వున్నవాడు ఆ సైకిల్ ని కాజేస్తే  ఇంక పథకాలకు అర్ధము ఏముంది?

5) అన్నిటికంటే ముఖ్యముగా నాయకుడికి నిస్వార్థమైన సేవా గుణము కలిగి ఉండాలి. స్వార్ధము తో  ఆస్తులు కూడగట్టుకొనే నాయకులని ఇంకా భరించగలమా అని ఆలోచించాలి ఓటు వేసేటప్పుడైనా.

ఏదో లోకల్ గల్లీ నాయకుల స్వార్ధము తో కులాల వారీగా విడిపోయి ఓటు వేసినంతకాలం మన మండల అభివృద్ధి ఎండ మావి లాంటిదే అని మరచి పోవద్దు. చిన్న చిన్న నేటి స్వార్ధాల కోసం మన రేపటి పౌరుల భవిష్యత్ ని అంధకారం చెయ్యడము ఎంత వరకు కరెక్ట్, ఆలోచించాలిసిన తరుణం ఆసన్నమయింది.

రండి ప్రశ్నిద్దాము. ఓటు అడిగే ప్రతి ఒక్కరిని ఈ క్రింది విధముగా ప్రశ్నిద్దాము.

1) చిన్నగంజాం మండలానికి ఏమి చేశారు?
2) గెలిస్తే ఏమి చెయ్యగలరు?
3) ఇప్పటి వరకు ఇచ్చిన మాటలను నెరవేర్చారా?
4) మీ వ్యాపారాలకు ఎంత సమయం కేటాయిస్తారు? మరి ప్రజల సమశ్యల పరిస్కారానికి ఎంత సమయం?

గ్రామ కాపురస్థులారా? మూడు ఎన్నికలు పోయేలోగా మన పిల్లల భవిష్యత్ నిర్ణయం అయిపోతుంది. ఎందు కంటే పుట్టిన బిడ్డ మూడు ఎన్నికలలో పెద్ద అయిపోయి కాలేజీ కి వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. చైతన్యంతో మన పిల్లల భవిష్యత్ బాగుండాలి అంటే ఈరోజు ఓటు నిర్మొహమాటం గా ఉండాలి.

జై హింద్
శరభయ్య పోలకం


     

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం