Skip to main content

పేద వారు పెద్ద వారైతే యెట్లా?

పూర్వం రాజులు ఆ తరువాత భూస్వాములు ప్రజలను తమ చెప్పు చేతలలో ఉంచుకొని బానిసత్వాన్ని పెంచి పోషించి ప్రజల కష్టం మీద బ్రతుకుతూ, ఆ విషయం ప్రజలకి తెలియకుండా రాజ్య పరిపాలన అనే మాటను అడ్డు పెట్టుకొని కాలం నెట్టుకొచ్చారు.

కాల క్రమేణా రాజ్యాలు, భూస్వాములు ప్రజల ధాటికి కొట్టుకొని పోయి మనుగడ సాదించలేక కొత్త ముసుగుతో వేషం మార్చారు. మనం వారిని ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అంటున్నాము. సంక్షేమ పధకాలు ప్రజలకోసం తెచ్చాము అంటారు కానీ, తరువాత మన పార్టీ పర పార్టీ అని మనలో మనకు బేధాలు సృష్టిస్తారు. అంతలోనే వారి పార్టీ  లో కూడా పలానా వారు ఎక్కువ ఖర్చు పెట్టారు అని అక్కడ కూడా పెద్దపీట నాయకులకే వేస్తారు. పూరెస్ట్ అఫ్ పూర్ అనే మాటకి అర్ధాలు మార్చారు.

అసలు, సంక్షేమ పధకాలు పేద ప్రజలకి అన్న విషయం మరచి పోయి, పెద్ద వారికే అన్నట్టు గా వ్యవహరిస్తారు. ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే పర పార్టీ ముద్ర వేస్తారు. అయినా కానీ ఎన్నికలలో మళ్లి వారే డబ్బుతోనో లేక మద్యం తోనో  గెలుస్తారు.

పేద వారు పెద్ద వారైతే యెట్లా? మా మోసాలు తెలిసి మాకు ఎదురు తిరిగితే ఇప్పుడు వున్నా రాజకీయ ముసుగు తీసి వేసి ఇంకొక ముసుగు వేసుకోవాలేమో కదా? కాబట్టి పేద ప్రజలు పేదలుగానే మిగిలి పోవాలి.

లేకపోతే మరేమిటి? ఈ సంక్షేమ పధకాల పేరుతో అయినవారికి ప్రజల సొమ్ముని దోచిపెట్టే బదులు, ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు లేకపోతే స్వయం ఉపాధి కల్పించే  కుటీర పరిశ్రమలు నిర్మించవచ్చు కదా?

చివరికి మన గౌరవ ప్రధాన మంత్రివర్యులు మోడీజీ గారు పెట్టిన ముద్ర లోన్స్ కూడా ప్రజలకి అందించలేని దౌర్భాగ్యం ఎందుకు?

మన పని మనమే చేసుకొందాము. చారిటబుల్ ట్రస్ట్ వారు ముద్ర లోన్స్ మీద కాన్సంట్రేషన్ చెయ్యాలని మనవి.

జై హింద్,
శరభయ్య పోలకం   
   

  

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం