Skip to main content

ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు

ఎన్నో సంవత్సరాల మేధో మథనం, ఎందరో కలల స్వప్నం చిన్నగంజాం మండలం ప్రజల ఐఖ్య వేదిక మన ట్రస్ట్. ఇన్ని రోజుల పాద యాత్ర ఎన్నో జవాబు లేని ప్రశ్నలకి సమాధానాలు వెతికింది. ఊరంతా బ్రహ్మ రధం పట్టింది, తెల్లచొక్కాలకి చమటలు పట్టించింది.

ఎన్నో బెదిరింపులు, ఫ్లెక్సీల పై ప్రతాపాలు, వెరసి వెగటు పుట్టించే గల్లీ నాయకుల రంగులు, సామాన్యుల పై వారి దాష్టికాలు. ఏమి చెయ్యలేని సామాన్యుల అచేతన స్థితి. నేను తెలుసుకొన్న విషయాలు ఒక్కొక్కటి గా ఫేసుబుక్ సాక్షి గా ప్రజల కి తెలియచేయటం నా విధిగా భావించి ఈ సిరీస్ ని ప్రారంభిస్తున్నాను.

మొదటిగా స్వచ్ఛ భారత్ మిషన్,  ఎంతో గర్వించదగ్గ ఒక కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రజల క్షేమం మరియు ఆరోగ్యం కోసం పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం, స్వార్ధ పరుల చేతుల్లో చేవ చచ్చి చతికిల పడటం చూస్తుంటే వ్యవస్థ మీద అసహ్యం వేస్తుంది.  దగ్గర వుండి ప్రజల డబ్బు పరుల పాలు కాకుండా చూడవలసిన ప్రజా ప్రతినిధులు, ప్రజలకి  చెందవలసిన ఈ పధకాన్ని ఒక పధకం ప్రకారం దోచుకుంటుంటే చూస్తూ ఊరుకొంటున్న ప్రభుత్వ యంత్రంగం, మీడియా ల మీద వున్నా కించిత్తు గొరవం కాస్తా గంగ పాలు కాక మానదు.

1) మనిషి కూడా పట్టని లెట్రిన్ దొడ్డి, చెత్తకుప్పలుగా రూపాంతరం చెందటం చోచనీయం. ప్రభుత్వం 15000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన దొడ్డి ని మీరు వాడకుండా చెత్తకుప్పగా మార్చడము కరెక్ట్ యేనా అని అడిగిన స్పెషల్ ఆఫీసర్ కి దిమ్మ తిరిగే సమాధానం ప్రజలు ఇవ్వడము చూచాను.  ఏమి చెయ్యమంటారు సారూ, దాని లోకి పోతే మల్లి తిరిగి రాము, అంత చిన్నది.

2) సగం కట్టి బిల్స్ చేసుకొని గాలికి వదిలి వేసిన మొండి గోడలుని నిద్ర లేవగానే చూచే చుకొని, ఆమ్మో ఈ రోజు ఏమి కీడు జరుగుతుందో అని హడలి పోయినా రోజులు లెక్క లేనన్ని. చెంబు పట్టుకొని పొలం లోకి పోవడము మారక పోగా, కనీసం ప్రశాంతముగా నిద్ర  లేచే భాగ్యానికి కరువయింది.

3) ఇప్పటికే పెద్ద ఇల్లు కట్టుకొని, లెట్రిన్ కూడా వున్నవారిని కూడా మభ్య పెట్టి వారికీ లెట్రిన్ కట్టించినట్లు బిల్స్ చేయించుకొని ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు.

ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వున్న తెల్ల చొక్కాలని తొలగిస్తే ఈ దుస్థితి పోతుందనేది అందరూ ఎరిగిన సత్యం. ప్రజలకి డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బు వేసి వారి పనులు వారి చేతే చేయిస్తే  ఎప్పటికైనా బాధ్యతాయుతమైన పౌరులని చూస్తామేమో. మార్పు ఒక్క సారిగా రాదు, కానీ అనగా అనగా రాగమతిశయించు, తినగా తినగా వేము తియ్యనౌను.

జై హింద్
శరభయ్య పోలకం


Comments

Post a Comment

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం