Skip to main content

మీసేవ ప్రభుత్వం ప్రజలకి కల్పించిన సర్వీస్ కాదా?


చిన్నోడా ఆ కరెంటు బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు పొలం వెళ్ళాను, కరెంటు బిల్ కట్టలేదు. కొంచెం కరెంటు ఆఫీస్ కి వెళ్లి బిల్ కట్టిరా. బిల్ కలెక్టర్ సాయంత్రం వస్తాడు కడతానులే సమాధానం ఇచ్చిన రోజునే బిల్ కట్టి బిల్ కాగితం ఇంట్లో ఇచ్చాను. రాను రాను జనాలు పెరిగారు, కనెక్షన్స్ పెరిగాయి. కానీ బిల్ కలెక్టర్లు ని పెంచడం ప్రభుత్వానికి తలకి మించిన పని అయ్యింది.

 పనికి ఆహరం పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉద్యోగ కల్పనలో చూపించలేక పోయింది. ఫలితం, మీసేవ...  ఇలాంటి సేవలన్నీ, ప్రభుత్వం చేయడానికి ఉద్యోగులు అవసరం, కానీ మన ప్రభుత్వాలు అక్కడ పొదుపు సూత్రం గట్టిగా పాటించి మీసేవ అనే ప్రైవేట్ / పొరుగు సేవల కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అక్కడే పొరుగు సేవల నిర్వాహకుల విషయము లో మంచి సుద్ధ పప్పులో కాలు వేసింది. 

 మీసేవ నిర్వాహకులు సేవని వ్యాపారం చేయడానికి ఎన్నో ఎక్కువ రోజులు తీసుకోలేదు. Rs. 10/- తీసుకోవలసిన అప్లికేషన్ కి షుమారుగా Rs. 300/- ఛార్జ్ చెయ్యడము, అది ఒక కస్టమరీ గా మారి పోవడము జరిగిపోయింది. మరి ఆకలితో వున్నవాడిని అరిశలకి కాపలా పెట్టి అరిసెలు తినవద్దు అంటే ఎలా? కానీ దాని వలన బలిఐన "రోజు-గడవని పేద ప్రజలని" చూస్తుంటే బాధ.

1) ప్రజలకి సేవ చేసే ప్రభుత్వ రంగాలకి జవసత్వాలు ఇచ్చి తద్వారా ఉద్యోగ కల్పన చేస్తే అటు నిరుద్యోగం , ఇటు ప్రజలకి మంచి సర్వీస్ లభిస్తుంది అనడం  సత్య దూరం కాదేమో, చంద్రబాబు ఆలోచిస్తే జనాలు భ్రహ్మరధం పడతారు. 

2) హోటల్ లో మెనూలో ఖరీదు ఎలా వేస్తారో, మీసేవ కార్యాలయం లో కూడా రేట్స్ పట్టి ఒకటి పబ్లిక్ బోర్డు  ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో? 

3) నిజానికి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ని కంట్రోల్ చెయ్యడము లో మీడియా మంచి పాత్ర పోషించాలి. కానీ ఈ రోజులలో మీడియా "వారి వారి పార్టీలకి" ప్రచారము చెయ్యడము లో బిజీ అయిపోయాయి గనుక ఈ బాధ్యతని సామాజిక కార్యకర్తలు పోషిస్తే కొంచెం జవాబిదారుతత్వం పెరగవచ్చు. 

 చంద్రబాబు గారి  పిలుపు మేరకు గ్రామాన్ని దత్తత తీసుకొన్న తరువాత చాలా మంది సామాజిక కార్యకర్తలు కలసి వచ్చి గ్రామంలో వున్న పరిస్థితులని మెరుగు పరుస్తున్నారు.  ఈ మద్య మా గ్రామములో వున్న మీసేవ ఇర్రెగ్యులారిటీస్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి సరి చెయ్యడము చూస్తే నాకు గర్వంగా వుంది. ప్రజలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రభత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడము ఒక పౌరుడిగా మన బాధ్యత.

ఇది ఒక inspiration గా తీసుకొని అన్యాయం ఏ రూపంలో వున్నా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియ చేయాలని చిన్నగంజాం గ్రామ ప్రజలకి నా అప్పీల్. నిజం వైపే మంచి ఉంటుంది. ప్రభుత్వము ఉంటుంది. 

ప్రజలు నిజాల్ని విస్మరించి మనకు ఎందుకు అని అనుకొంటే మన దాకా వచ్చేసరికి పెనుభూతం అయ్యి కూర్చుంటుంది అన్యాయం.               

 జైహింద్,
 శరభయ్య పోలకం 

          

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం