Skip to main content

మీసేవ ప్రభుత్వం ప్రజలకి కల్పించిన సర్వీస్ కాదా?


చిన్నోడా ఆ కరెంటు బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు పొలం వెళ్ళాను, కరెంటు బిల్ కట్టలేదు. కొంచెం కరెంటు ఆఫీస్ కి వెళ్లి బిల్ కట్టిరా. బిల్ కలెక్టర్ సాయంత్రం వస్తాడు కడతానులే సమాధానం ఇచ్చిన రోజునే బిల్ కట్టి బిల్ కాగితం ఇంట్లో ఇచ్చాను. రాను రాను జనాలు పెరిగారు, కనెక్షన్స్ పెరిగాయి. కానీ బిల్ కలెక్టర్లు ని పెంచడం ప్రభుత్వానికి తలకి మించిన పని అయ్యింది.

 పనికి ఆహరం పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉద్యోగ కల్పనలో చూపించలేక పోయింది. ఫలితం, మీసేవ...  ఇలాంటి సేవలన్నీ, ప్రభుత్వం చేయడానికి ఉద్యోగులు అవసరం, కానీ మన ప్రభుత్వాలు అక్కడ పొదుపు సూత్రం గట్టిగా పాటించి మీసేవ అనే ప్రైవేట్ / పొరుగు సేవల కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అక్కడే పొరుగు సేవల నిర్వాహకుల విషయము లో మంచి సుద్ధ పప్పులో కాలు వేసింది. 

 మీసేవ నిర్వాహకులు సేవని వ్యాపారం చేయడానికి ఎన్నో ఎక్కువ రోజులు తీసుకోలేదు. Rs. 10/- తీసుకోవలసిన అప్లికేషన్ కి షుమారుగా Rs. 300/- ఛార్జ్ చెయ్యడము, అది ఒక కస్టమరీ గా మారి పోవడము జరిగిపోయింది. మరి ఆకలితో వున్నవాడిని అరిశలకి కాపలా పెట్టి అరిసెలు తినవద్దు అంటే ఎలా? కానీ దాని వలన బలిఐన "రోజు-గడవని పేద ప్రజలని" చూస్తుంటే బాధ.

1) ప్రజలకి సేవ చేసే ప్రభుత్వ రంగాలకి జవసత్వాలు ఇచ్చి తద్వారా ఉద్యోగ కల్పన చేస్తే అటు నిరుద్యోగం , ఇటు ప్రజలకి మంచి సర్వీస్ లభిస్తుంది అనడం  సత్య దూరం కాదేమో, చంద్రబాబు ఆలోచిస్తే జనాలు భ్రహ్మరధం పడతారు. 

2) హోటల్ లో మెనూలో ఖరీదు ఎలా వేస్తారో, మీసేవ కార్యాలయం లో కూడా రేట్స్ పట్టి ఒకటి పబ్లిక్ బోర్డు  ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో? 

3) నిజానికి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ని కంట్రోల్ చెయ్యడము లో మీడియా మంచి పాత్ర పోషించాలి. కానీ ఈ రోజులలో మీడియా "వారి వారి పార్టీలకి" ప్రచారము చెయ్యడము లో బిజీ అయిపోయాయి గనుక ఈ బాధ్యతని సామాజిక కార్యకర్తలు పోషిస్తే కొంచెం జవాబిదారుతత్వం పెరగవచ్చు. 

 చంద్రబాబు గారి  పిలుపు మేరకు గ్రామాన్ని దత్తత తీసుకొన్న తరువాత చాలా మంది సామాజిక కార్యకర్తలు కలసి వచ్చి గ్రామంలో వున్న పరిస్థితులని మెరుగు పరుస్తున్నారు.  ఈ మద్య మా గ్రామములో వున్న మీసేవ ఇర్రెగ్యులారిటీస్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి సరి చెయ్యడము చూస్తే నాకు గర్వంగా వుంది. ప్రజలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రభత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడము ఒక పౌరుడిగా మన బాధ్యత.

ఇది ఒక inspiration గా తీసుకొని అన్యాయం ఏ రూపంలో వున్నా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియ చేయాలని చిన్నగంజాం గ్రామ ప్రజలకి నా అప్పీల్. నిజం వైపే మంచి ఉంటుంది. ప్రభుత్వము ఉంటుంది. 

ప్రజలు నిజాల్ని విస్మరించి మనకు ఎందుకు అని అనుకొంటే మన దాకా వచ్చేసరికి పెనుభూతం అయ్యి కూర్చుంటుంది అన్యాయం.               

 జైహింద్,
 శరభయ్య పోలకం 

          

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం