Skip to main content
నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి చిన్నగంజాం మార్కెట్ లో చాపలు, రొయ్యలు మరియు కొన్ని ఆకు కూరలు ఎప్పుడు తూకం వేసి అమ్మ లేదు ఎవ్వరును. అలా ఎందుకు చేయ్యరో ఒక్కసారి ఆలోచిద్దాము.

1) మత్స్యకారులు మరియు ఇతరులు ఎంతో శ్రమకోడ్చి వేట లో పడిన సరుకు మార్కెట్ కి తెస్తారు. అక్కడ వెంటనే చిన్నపాటి చిల్లర వ్యాపారులకు అమ్ముతారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ వేటగాళ్లు మరియు చిన్నవ్యాపారులు ఒకే కుటుంబం లాగా అన్నమాట. అంతా చిన్నగంజాం వాళ్లే  కాబట్టి ఒకరిని ఒకరు అంతగా మోసం చేసునేది ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అండ్ జగమెరిగిన సత్యం.

2) చిరు వ్యాపారులు పచ్చి సరుకు పాడై పోయే లోపులోనే అమ్మగలగాలి. ఇది చాలా స్కిల్ తో కూడు కున్న వ్యవహారం. సరుకు బాగా వున్నప్పుడు అంటే ఫ్రెష్ గా మరియు పెద్దవి అయితే రేట్ ఎక్కువకి లేకపోతే  తక్కువకి  ఇవ్వాలి. లేక పోతే సరుకు మిగిలి పోయి చిరు వ్యాపారి నష్ట పోతాడు.  ఇక్కడ చిరు వ్యాపారి అంటే రోజు వారి కూలీలే. కష్టం చేసే ఓపిక లేక పాపం ఇంత రిస్క్ చేస్తారు.

3) ఇక్కడ వినియోగదారులు కూడా రెగ్యులర్ కస్టమర్స్. చిరు వ్యాపారులకు మరియు కస్టమర్స్ కి ఇక్కడ వున్న సంబంధం  పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఒక కేసుస్టడీ కాగలదు. నేను ఎప్పుడు ఇండియా వెళ్లినా నన్ను గుర్తు పట్టి నువ్వు పలానా మల్లి వాళ్ళ తమ్ముడివి కదా అని అడిగి మరీ సరుకు ఇస్తారు.

ఇంత న్యాయ బద్దముగా వ్యాపారం చేసే వాళ్ళ గురించి ఇలాంటి వార్తలు రావడము ఏం బాధాకరం మరియు ఖండించాలిసిన విషయం. ఎంతో బాధ్యతాయుతముగా పేపర్లో స్పేస్ ని వినియోగించాలిసిన విలేకర్లు ఇలాంటి వాటి మీద వార్త రాయడం ఎంతో శోచనీయం.

ప్రక్క ధోవల పడుతున్న సంక్షేమ పధకాల మీద వార్తలు వస్తే జనాలు హర్షిస్తారు. అసలుకే మోసం రాక ముందే ప్రింట్ మీడియా జాగ్రత్త వహించగలదని చిన్న ఆశతో

జై హింద్,
శరభయ్య పోలకం 


  

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం