Skip to main content

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు.
  • మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం. 
  •  విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన. 
  • తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది.
  • రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను.
  • మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు. 
  • మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు. 
మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి?
  • టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్... 
  • 2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్రం ఎంత ఇచ్చింది ఇంకా ఎంత ఇవ్వాలి అన్న మాటే లేదు. 
  • ఆర్డర్ లో వున్న సభని స్లోగన్ ఇచ్చి గందరగోళం సృష్టించి మన తెలుగు వాళ్ళ పరువు మల్లి పార్లమెంట్ సాక్షిగా పలచన చేశారు. 
  • చంద్రబాబు ఫెయిల్యూర్ మోడీ నోటి నుండి వినబడింది. ఇప్పటి వరకు సందేహం వున్న తెలుగు ప్రజలకి చంద్రబాబు మీద వున్న ఆకాస్త నమ్మకము కూడా పోయింది. 
  • చంద్రబాబు కి వైసీపీ అంటే భయం అన్న పవన్ కళ్యాణ్ మాట నిజం అని మోడీ గారు చెప్పకనే చెప్పారు. 
 మరి చంద్రబాబు తక్షణ కర్తవ్యం:
  • నైతికంగా సాక్ష్యాత్తు దేశ ప్రధాని తో అక్షింతలు వేయించుకున్న చంద్రబాబు గారు గౌరవంగా పదవికి రాజీనామా చేసి  మళ్ళీ ఎన్నికలకి వెళ్ళడము. 
  • అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలని కలిపి అసలు మనకు స్పెషల్ స్టేటస్ అవసరమా కాదా అని తేల్చడము.   
  • భవిష్యత్ లో తమ మాట మాత్రమే వినేవాళ్ళని కాకుండ, చదువు మరియు తెలివితేటలు వున్నవాళ్లను చట్ట సభలకి పంపించడము. 
  • ఇప్పుడు వున్న క్షేత్రస్థాయి కార్యకర్తలని ప్రక్షాళన చెయ్యడము. నిజమైన ప్రజల నాయకులని ప్రోత్సహించడము. 
మరి ఇలా చెయ్యకుండా అవినీతి తో సంపాదించిన డబ్బుతో ఎన్నికలకి వెళితే ఆ డబ్బులతో రాజేసిన మంటల సెగలో టీడీపీ బూడిద కాక తప్పదు.

జైహింద్
శరభయ్య పోలకం






Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం