Skip to main content

వలస కార్మికులు, మనం తల వంచుకోవాల్సిన విషయం కాదా?


వలస కార్మికులు దేశంలో ఇంకా వున్నారు అంటే, అది మనం సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం కాదా? భారత్ వెలిగి పోతుంటే మరి ఈ వలసలు ఏమిటి? కరోనా వలన ఇంత మంది పరాయి పంచన బతుకు ఈడుస్తున్నారనే సత్యం వెలుగు చూసింది. మరి తెలిసి మనం చేస్తున్నది ఏమిటి? నారద పాత్ర పోషిస్తున్న మీడియా ఇలాంటి వాటిని వెలుగు లోకి తెచ్చి, ఇంటెలెక్చవల్స్ తో డిబేట్స్ ఎందుకు పెట్టవు?

ఎంత సేపు, నేను నా పార్టీలు పదవిలోకి రావాలి, ప్రభుత్వ సొమ్ముని జుఱ్ఱు కోవాలి అన్న యావ తప్ప, భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన జీవితం సాగించాలని దానికి కావలసిన ప్లానింగ్ చెయ్యాలని మన నాయకులు అని అనుకొంటున్న వాళ్ళు ఎందుకు అనుకోవడములేదు.  చల్లకొచ్చినమ్మ ఎంతకాలం ముంత దాస్తుంది? మేము బాగానే వున్నాము అని దాగుడుమూతలు ఎంతకాలం?

పప్పు బెల్లాలు పంచి నోరు తీపిచేసాములే అని దాటవేత ధోరణితో పాలన సాగించడము ఈనాటి మేటి నాయకులకే చెల్లింది. నేను బాగా లేక పోయినా పర్లేదు, రేపటి తరం కోసం పునాది వేస్తున్నా అని చెప్పిన పుస్తకాలలో చదివిన తాత ఏమిటి అంజనం వేసి చూసినా సెంటర్ లో కనబడటం లేదు?

వీరిది ఏ కులం? ఏ మతం? కొంచెం చెబితే మన నాయకుల నుండి మరియు వారి వెనకాల వున్న మీడియా నుండి వినాలని వుంది. కులం అండతో గెలిచిన పాలకులు కనీసం వాళ్ళకులాల వాళ్ళైనా వలస కార్మికులు కాకుండా అభివృద్ధి చేశారా? మరి ఆలా అయ్యి ఉంటే ఇప్పటి వలస కార్మికులలో కమ్మ, రెడ్డి లేరని చెప్పగలరా? పేద వాడిని కులం పేరుతో సమాజం నుండి వేరు చేసే కుతంత్రం ఇంకెంతకాలం సాగుతుందో? ఏమో నాకేటి తెలుసు? ఆ శివయ్య ఏటనుకొంటున్నాడో ఏటో ?

జై హింద్,
శరభయ్య పోలకం
 

     

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం