Skip to main content

వలస కార్మికులు, మనం తల వంచుకోవాల్సిన విషయం కాదా?


వలస కార్మికులు దేశంలో ఇంకా వున్నారు అంటే, అది మనం సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం కాదా? భారత్ వెలిగి పోతుంటే మరి ఈ వలసలు ఏమిటి? కరోనా వలన ఇంత మంది పరాయి పంచన బతుకు ఈడుస్తున్నారనే సత్యం వెలుగు చూసింది. మరి తెలిసి మనం చేస్తున్నది ఏమిటి? నారద పాత్ర పోషిస్తున్న మీడియా ఇలాంటి వాటిని వెలుగు లోకి తెచ్చి, ఇంటెలెక్చవల్స్ తో డిబేట్స్ ఎందుకు పెట్టవు?

ఎంత సేపు, నేను నా పార్టీలు పదవిలోకి రావాలి, ప్రభుత్వ సొమ్ముని జుఱ్ఱు కోవాలి అన్న యావ తప్ప, భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన జీవితం సాగించాలని దానికి కావలసిన ప్లానింగ్ చెయ్యాలని మన నాయకులు అని అనుకొంటున్న వాళ్ళు ఎందుకు అనుకోవడములేదు.  చల్లకొచ్చినమ్మ ఎంతకాలం ముంత దాస్తుంది? మేము బాగానే వున్నాము అని దాగుడుమూతలు ఎంతకాలం?

పప్పు బెల్లాలు పంచి నోరు తీపిచేసాములే అని దాటవేత ధోరణితో పాలన సాగించడము ఈనాటి మేటి నాయకులకే చెల్లింది. నేను బాగా లేక పోయినా పర్లేదు, రేపటి తరం కోసం పునాది వేస్తున్నా అని చెప్పిన పుస్తకాలలో చదివిన తాత ఏమిటి అంజనం వేసి చూసినా సెంటర్ లో కనబడటం లేదు?

వీరిది ఏ కులం? ఏ మతం? కొంచెం చెబితే మన నాయకుల నుండి మరియు వారి వెనకాల వున్న మీడియా నుండి వినాలని వుంది. కులం అండతో గెలిచిన పాలకులు కనీసం వాళ్ళకులాల వాళ్ళైనా వలస కార్మికులు కాకుండా అభివృద్ధి చేశారా? మరి ఆలా అయ్యి ఉంటే ఇప్పటి వలస కార్మికులలో కమ్మ, రెడ్డి లేరని చెప్పగలరా? పేద వాడిని కులం పేరుతో సమాజం నుండి వేరు చేసే కుతంత్రం ఇంకెంతకాలం సాగుతుందో? ఏమో నాకేటి తెలుసు? ఆ శివయ్య ఏటనుకొంటున్నాడో ఏటో ?

జై హింద్,
శరభయ్య పోలకం
 

     

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం