నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి చిన్నగంజాం మార్కెట్ లో చాపలు, రొయ్యలు మరియు కొన్ని ఆకు కూరలు ఎప్పుడు తూకం వేసి అమ్మ లేదు ఎవ్వరును. అలా ఎందుకు చేయ్యరో ఒక్కసారి ఆలోచిద్దాము. 1) మత్స్యకారులు మరియు ఇతరులు ఎంతో శ్రమకోడ్చి వేట లో పడిన సరుకు మార్కెట్ కి తెస్తారు. అక్కడ వెంటనే చిన్నపాటి చిల్లర వ్యాపారులకు అమ్ముతారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ వేటగాళ్లు మరియు చిన్నవ్యాపారులు ఒకే కుటుంబం లాగా అన్నమాట. అంతా చిన్నగంజాం వాళ్లే కాబట్టి ఒకరిని ఒకరు అంతగా మోసం చేసునేది ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అండ్ జగమెరిగిన సత్యం. 2) చిరు వ్యాపారులు పచ్చి సరుకు పాడై పోయే లోపులోనే అమ్మగలగాలి. ఇది చాలా స్కిల్ తో కూడు కున్న వ్యవహారం. సరుకు బాగా వున్నప్పుడు అంటే ఫ్రెష్ గా మరియు పెద్దవి అయితే రేట్ ఎక్కువకి లేకపోతే తక్కువకి ఇవ్వాలి. లేక పోతే సరుకు మిగిలి పోయి చిరు వ్యాపారి నష్ట పోతాడు. ఇక్కడ చిరు వ్యాపారి అంటే రోజు వారి కూలీలే. కష్టం చేసే ఓపిక లేక పాపం ఇంత రిస్క్ చేస్తారు. 3) ఇక్కడ వినియోగదారులు కూడా రెగ్యులర్ కస్టమర్స్. చిరు వ్యాపారులకు మరియు కస్టమర్స్ కి ఇక్కడ వున్న సంబంధం...