Skip to main content

మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది?


క్రిష్ణా, గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజానామా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చెయ్యడంలో నాకు తప్పు ఏమి కనబడటం లేదు. ఆ రోజు అన్ని పార్టీలు కలసి ఏకాభిప్రాయంతో అమరావతిని  రాజధానిగా నిర్ణయించినప్పుడు, ఆ రెండు జిల్లాల రైతులు సంతోషముగా వారి పొలాలను డెవలప్మెంట్ కోసం ప్రభుత్వానికి త్యాగం చేశారు. ఆ తరువాత చంద్రబాబు కేంద్రంతో గొడవపడి డెవలప్మెంట్ ని ప్రక్కకు పెట్టి ప్రజల ఆస్తులను దోచుకోవడం మీద ద్రుష్టి పెట్టడంతో ప్రజల విశ్వాసాన్ని కోలుపోయారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రజలు జగన్ కి ప్రభుత్వ పగ్గాలు అందిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆశించి వైసీపీ కి ఓట్లు వేసి వారి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యులు అయ్యారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయకపోగా, అసలుకే మోసం తెస్తే మరి సొల్యూషన్ ఏమిటి? మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది? రాజీనామాలు చేసి మల్లి ఎన్నికలకి వెళ్ళండి. మూడు రాజధానుల అంశం మీదనే ఓట్లు అడగండి. గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యండి, లేకపోతే యధాస్థితి కొనసాగించండి.

రాజానామాలు చెయ్యడం ఇష్టం లేకపోతే, మిగిలిన మూడు ఏండ్లు  అమరావతిలో కొరవ పనులు చెయ్యండి. 2024 ఎన్నికలలో మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు మల్లి గెలిచినప్పుడు మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యండి. మీకు అప్పుడు అడ్డు ఎవరు అధ్యక్షా ?

 జై హింద్,
శరభయ్య పోలకం
         

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం