Skip to main content

Posts

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...
Recent posts
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   
బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...

కరోనా సమయం లో ప్రశాంతత కావాలి

గ్రామాలు రాష్ట్రాన్ని కాపాడాలిసిన సమయం వచ్చింది ఇప్పుడు. అధికారం కాపాడుకోవడానికి ఒకరు, మళ్లి అధికారం పొందడానికి మరొకరు, రాష్ట్రాన్ని రావణాకాష్టం చేస్తున్నారు. మనం ఇప్పుడు పార్టీల పరంగా విడిపోకుండా క్రొత్త పోకడకు పోవడం చాలా అవసరం. మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన అసహాయత నిన్న ప్రెస్మీట్ లో వ్యక్తపరచడం జరిగింది.  జగన్ గారికి, చంద్రబాబు గారికి నా విన్నపం, మాకు ఈ కరోనా సమయం లో నిచ్చలమైన ప్రశాంతత కావాలి. మీరు మాకు ఏమి సహాయం చెయ్యవలసిన అవసరం లేదు. కొంచెం సమాజానికి దూరం వుండండి చాలు.  మా తిప్పలు మేము పడి మళ్లి  సమాజాన్ని నిలబెట్టుకొంటాము. మీరు రాష్ట్రానికి చేసిన మేలు చాలు, ఇక చాలు.   
 రైతు పండించే పంటకి క్రయ, విక్రయ  లెక్కలు అడుగుతుంది మోడీ గారి ప్రభుత్వం, ఎందుకంటె? 1) రైతు పెట్టుబడు ఎంత పెడుతున్నాడు, దానికి ప్రతిఫలం ఎంతవస్తుంది. లాభం వస్తే పర్వాలేదు, కానీ నష్టాలు వస్తుంటే దానికి తగ్గ సాయం అందించే కార్యక్రమం చేపట్టడానికి. ఇప్పటి వరకు ఒక లెక్క పత్రం లేని జీవితం రైతుది.  2) రైతుల దగ్గర, దళారీలు తక్కువ ధరకి సరుకు కొని విఫణిలో మూడింతలుకి అమ్మి, ఆ వచ్చిన లాభం లెక్క దళారీలు ప్రభుత్వానికి చెప్పకుండా బ్లాక్ మనీ  కూడబెట్టకుండా ఆపడానికి.  3) బ్లాక్ మనీ కూడబెట్టిన ఇలాంటి దళారీలు, ఈ అక్రమ డబ్బుని మళ్ళీ ఎలేక్షన్  లో పెట్టుబడి గా పెట్టి, ప్రభుత్వాలని శాశించేవాళ్ళని ఆపడం .  ఇప్పుడు చెప్పండి రైతులారా, పోరాటం చేసి బిక్షం తీసుకొందామా? లేక ఇంకా గట్టి చట్టాలు తీసుకొచ్చి దళారీల పని పడదామా? ఇప్పుడు చెప్పండి భయ్యా, జై మోడీజీ అని . ఇంకొక మూడు సార్లు మోడీ గారు వస్తేనే మనము ఈ పాచిపోయిన పోరాటాలు నుండి బయటకి వస్తాము.   జై హింద్, శరభయ్య పోలకం 

Leader for better tomorrow and better society

యుగాలుగా కులము అని, ప్రాంతము అని విచ్చిన్నమైన తెలుగు జాతికి ఒక దివ్వె దీక్చూచి దిశా నిర్ధేశం చేస్తుంది. రండి మనం తెలుగు నుడికారాన్ని మళ్ళీ వినిపిద్దాము.  ఆంధ్రుల ఐఖ్యత మనం జన సేనానికి ఇచ్చే జన్మదిన కానుక. తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే. ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్ శరభయ్య పోలకం