Skip to main content

దుక్కి దున్నడానికి పనికిరాని దున్నపోతుని ఏమి చెయ్యాలి?

చిన్నగంజాం మండలంలో,  సంక్షేమ పధకాలేమో అస్మదీయుల పాలు. ఉద్యోగావకాశాలేమో శూన్యం. కొనఊపిరితో వున్న ఉప్పు పరిశ్రమలోనెమో కూళీ కరువు. రోజు రోజు కి పెరుగుతున్న నిరుద్యోగ యువత పరదేశి వలస పట్టి పచ్చని గ్రామాలు వృద్ధుల ఆశ్రమాలుగా రూపాంతరం చెందుతున్నా దున్నపోతు ఇంకా నిద్రపోతూనే వుంది. దాణా దొరుకుతుంది కదా తిని పడుకొంటుందేమో!!!

తోటి దున్నపోతుల దాణా కూడా ఈ దున్నపోతు తింటుందేమో కారంచేడు మండలం లో అసమ్మతి భగ్గుమంది ఈమధ్య. మా చిన్నగంజాం మండల దున్నపోతులకి ఆరిగ చెత్తే పెద్ద దాణా కదా, ఇంకా తమ సూడిని మేపుతున్నాయి బాగా తిని బలవమని.

వ్యతిరేకత వచ్చి, సాక్షాత్తు కామినేని గారు మంత్రిగా చిన్నగంజాం కి వచ్చినప్పుడు, తమ వందిమాదిగ గణం తప్ప ప్రజలు లేని సభని చూసి కామినేని గారు చిఛీ... అన్నాగానీ దున్నపోతులో చలనం లేదు.

డబ్బా కొట్టుకొనడానికి, చిన్నగంజాం, పెద్దగంజాం లో హడావుడి చెయ్యడానికి వచ్చిన దున్నకి జనసేన సైనికులు సోపిరాలలో చర్నాకోలు ఝళిపించినా పెద్దగా బెదరలేదు. చివరకి ఊరిని వర్గాలు వర్గాలుగా విడగొట్టానికి వేసిన పన్నాగం కూడా బెడిసిగొట్టడంతో, సోషల్ మీడియాలో రంకె వేసింది. పోలీస్ యంత్రంగాన్ని ఉసిగొలిపింది, కానీ ఫలితం శూన్యం.

అసలు దుక్కి దున్నడానికి కదా దున్నపోతుకు దాణా, దుక్కి దున్నడానికి పనికిరాని దున్నపోతుని ఏమి చెయ్యాలి? మెడలో గంటకొట్టి ఊరిమీద వదలాలి అంతేకదా జనులారా?

మరి కొత్త దున్నని ఎన్నుకొనే ముందు మరి దుక్కికి పనికి వచ్చే దున్నానేగా కొనుక్కోవాలి? జరా భద్రం బ్రదర్, ఇంకొక 5 యేండ్లు  మోసపోవద్దు . మంచి గొడ్డు వారుతో చేసిన చర్నాకోలు రెడీ గా పెట్టుకోండి దగ్గర, ఎందుకంటే, ఇప్పడు జన్మభూమి అని,  జన్మభూమి కమిటీ అని అన్నీ దున్నలు గుంపులుగా తిరుగున్నాయంట ఊళ్ళల్లో ఇప్పుడు....

జైహింద్,
శరభయ్య పోలకం

             

Comments

  1. Sir I want to talk with u.sir I also send find request to u.but can't get any reply.pls cal me sir.7729860424.I also from chinnaganjam

    ReplyDelete
  2. I am so interest to start small scale industry.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...

ఆత్మ నిర్భర భారత్ కి, నేను సైతం

మనకు వచ్చే అనేక వ్యాధులకు కారణం మన జీర్ణ వ్యవస్థ అని మీకు తెలుసా? జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడం మన చేతుల్లోనే వుంది. మన ఇంటిలోనే లాక్టోబాసిల్లస్ (పునీళ్లు) తయారు చేసుకోవచ్చు. మన తాతలు తండ్రులు చేసినదే. నేను పాటించిన తయారీ విధానం: 1) బియ్యం కడిగిన నీళ్లు ఒక గిద్ద తీసుకొని ఒక నైట్ కిచెన్ టాప్ మీద పెట్టండి. 2) రెండు లీటర్ల పాలు ఒక సీసా లో తీసుకొని, దానిలో బియ్యం నీళ్లు కలపండి. 3) మూడు రోజుల తరువాత పైన తేలిన మీగడ వడగట్టి, వచ్చిన నీళ్ళని స్టోర్ చేసుకొని, భోజనానికి ముందు ఒక అర గ్లాస్ తీసుకోండి. 4) మీకు హుషారుగా అనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యండి. జై హింద్ శరభయ్య పోలకం