Skip to main content

కేంద్ర నిధులు అన్ని రాష్ట్రాల ఉమ్మడి సొమ్ము కాదా?


దోపిడీదారులు సిండికేట్ అయిన ప్రభుత్వానికి కేంద్ర నిధులు ఇవ్వడానికి ప్రజలు మద్దతు లేదేమో? అందుకే ప్రజల నుండి అంత మద్దతు లేదు హోదా ఉద్యమానికి. 

రాష్ట్ర స్థాయి నాయకులు మరియు వారి మంచి & చెడ్డలు సామాన్య ప్రజలకి అంతగా తెలియదు. కానీ ఊరిలో ఎవరిని పోషిస్తున్నారో అందరికి తెలుస్తుంది. అంటే లోకల్ లో చెడ్డవారిని చేరతీసే రాష్ట్ర స్థాయి నాయకుల మీద గ్రామ స్థాయి లో వున్న ప్రజలకి మంచి అభిప్రాయం ఉండదు. అది వచ్చే ఎలక్షన్ లో షాక్ తగిలితే గాని సదరు నాయకుడికి అర్ధం కాదు.

మనకు నిధులు ఇస్తే ప్రక్క రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తారేమో?  ఎందు కంటే, కేంద్ర నిధులు అంటే అవి అన్ని రాష్ట్రాల ఉమ్మడి సొమ్ము. మరి దొంగల పాలు అవ్వడము అవసరమా?

అసలు మనము మంచి నాయకులని ఎన్నుకొనే అవకాశం ఈ విధముగా మోడీ గారు మనకు కల్పిస్తున్నారేమో? మంచి నాయకులు ఉంటే మనకు న్యాయం గా రావలసిన నిధులు మరియు హోదా వస్తాయేమో? ఏమో నాకేటి తెలుసు? ఆ శివయ్య ఏతానుకొంటున్నాడో ఏటో?

జై హింద్,
శరభయ్య పోలకం

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం